ఓటు వేసిన గవర్నర్ తమిళిసై…

129
tamilisai
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభంకాగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 88,936 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ అయిన డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఓటు వేశారు. చెన్నైలోని విరుగంబాక్కమ్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో తమిళిసై తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఓటింగ్‌ జరుగనుంది. అయితే.. అందరూ అనుకున్నట్లే ఐదు రాష్ట్రాల్ల ఎన్నికల్లో ఎక్కువ హడావుడి ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో మాత్రం సందడి కనిపిస్తోంది.

- Advertisement -