అమిత్ షాతో గవర్నర్ భేటీ..

348
amith shah narasimhan
- Advertisement -

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు గవర్నర్ నరసింహన్‌. సోమవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్‌ మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు.

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో షాతో భేటీ అయ్యానని చెప్పారు.రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని.. స్నేహ పూర్వకంగా ఉంటున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పరిష్కారం కాని పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయని చెప్పారు.

ఖాళీ భవనాలను, ఉపయోగంలో లేని భవనాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన నరసింహన్‌ ఏపీ భవన్ సహా విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని చెప్పారు.

- Advertisement -