దీపావళి శుభాకంక్షలు తెలిపిన గవర్నర్,సీఎం కేసీఆర్

637
kcr
- Advertisement -

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్,స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా (అక్టోబరు 27, ఆదివారం) ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకూ రాజభవన్ లోని దర్బార్ హాలులో గవర్నరు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పురప్రముఖుల నుండి దీపావళి శుభాకాంక్షలు అందుకుంటారు.

ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. చెడుపై మంచి సాదించిన విజయానికి ప్రతీక దీపావళి, మనసులోని అందకారం తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేది దీపావళి పండుగ అన్నారు. నరక చతుర్దశి, దీపావళి పండుగను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -