గవర్నర్లకు పనే ఉండదు..వైన్ తాగుతారు

407
satyapal Malik
- Advertisement -

గవర్నర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గోవా గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యపాల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. దేశంలో గవర్నర్లకు పెద్దగా పనే ఉండదన్నారు. జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా పని చేసే వారు వైన్‌ తాగి, గోల్ఫ్‌ ఆడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సత్యపాల్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలు దేశం వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయి. సత్యపాల్ మాలిక్ గవర్నర్ గా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోవాలో చేసేకంటే ముందు సత్య పాల్ మాలిక్ జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు. సత్యపాల్ మాలిక్ మాట్లాడిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -