రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

171
athome-conducted-in-rajbhavan-hyderabab
- Advertisement -

రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, శాసనసభ స్పీకర్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు డీ శ్రీనివాస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ రిపబ్లిక్ డే రోజున సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈ ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సాంప్రదాయం.

- Advertisement -