క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్,గవర్నర్

282
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌,గవర్నర్ నరసింహన్, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసు జననం ప్రజలకు సంతోషకరమైన సమయమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు ప్రేమ, సహనం ప్రంపంచానికి బోధించాడని కొనియాడారు. తాను క్రిస్టియన్ సహోదరులతో కలిసి ప్రపంచ శాంతి సామరస్యాల కోసం ప్రార్థిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు.

CM KCR

కరుణ, ఆనందంతో కూడిన ప్రేమను అందరికీ అందించాలన్న సందేశాన్ని మానవాళికి బోధించిన లార్డ్ జీసస్ పుట్టిన రోజును ప్రపంచవ్యాప్తంగా ఆనందంగా పండుగ జరుపుకొంటారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

- Advertisement -