రాజ్యాంగ స్పూర్తి ప్రధాత అంబేద్కర్: తమిళి సై

75
gov
- Advertisement -

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందని తెలిపారు గవర్నర్‌ తమిళిసై.హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్….రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి చేసిందన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌పై ఇంకా కొందరికి అపోహలు ఉన్నాయి. టీకా తీసుకుంటేనే కొవిడ్‌ నుంచి మరింత రక్షణ ఉంటుందన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోనివారే 99 శాతం మంది ఐసీయూలో చేరుతున్నారని వెల్లడించారు గవర్నర్.

కరోనా మహమ్మారి ఇంకా పోలేదని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. అందరూ తప్పనిసరిగా కరోనా టీకా వేయించుకోవాలని, రెండు డోసులు తీసుకోవాలని కోరారు.

- Advertisement -