ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్

18
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి 2989ఏడీ’ ఈ జనవరిలోనే థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ, ఈ చిత్రం విడుదలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. ఇందుకు హీరో ప్రభాస్ అభ్యంతరమే కారణమని ‘టైమ్స్ నౌ’రిపోర్టు పేర్కొంది. సలార్ సినిమా విడుదలై ఎక్కువ రోజులు కాలేదని, తక్కువ వ్యవధిలోనే ‘కల్కి 2898ఏడీ’ని విడుదల చేస్తే సలార్‌పై ప్రభావం పడుతుందని ప్రభాస్ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అందుకే, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మళ్లీ వాయిదా పడనుందట.

ఇక ‘కల్కి 2898 AD’ థియేటర్ డీల్స్ పూర్తి కాలేదు. ఇలాంటి భారీ సినిమా మొదలు కాకముందు నుంచే డిమాండ్ ఉంటుంది. రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడతారు. కానీ, ఇప్పటివరకు ఏపీ, తెలంగాణాలో ఎవరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటూ ముందుకు రాలేదు. దానికి కారణం.. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అడుగుతున్న రేట్లు. “ ‘కల్కి 2898 AD”కి ఈ నిర్మాత 110 కోట్లు అడుగుతున్నారట. అందుకే, ఎవరు ముందుకు రావడం లేదు. ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ కి ఇది కూడా ఒక కారణం అట.

కాగా, ‘కల్కి 2898 AD” సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై చాలా క్రేజ్ ఉంది. దీనికితోడు ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేసేలా చేసే అప్‌డేట్ అందింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ మూవీ నేటితో బ్రేక్ ఈవెన్ సాధించింది. బ్రేక్ ఈవెన్‌కు సంబంధించిన రూ. 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, సుమారు రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టింది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఒకేసారి అందాయి.

Also Read:హను-మాన్‌లో డిఫరెంట్ రోల్ చేశా:వరలక్ష్మీ

- Advertisement -