- Advertisement -
ఫాస్టాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్. యూపీఐ పేమెంట్స్కు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ రుసుములో మార్పు చేసింది.
యూపీఐ ద్వారా చెల్లిస్తే రెట్టింపు ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం. ఇకపై 25 శాతం అదనపు రుసుము మాత్రమే వసూలు చేస్తారు. నేటి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
నవంబరు 15 నుంచి అమలులోకి రానున్నాయి ఈ కొత్త నిబంధనలు. హైవే ప్రయాణికులలో FASTag వినియోగం ప్రస్తుతం సుమారు 98 శాతం ఉండగా, దీని వలన టోల్ ప్లాజాల్లో సగటు వేచి ఉండే సమయం 2022 నాటికి 47 సెకన్లకు తగ్గిందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.
Also Read:తిమ్మక్క మరణం బాధ కలిగించింది!
- Advertisement -

