- Advertisement -
బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పసిడి బాటలోనే వెండి కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరిగి రూ.48,880కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.20 పెరిగి రూ.53,310కు చేరింది.
బంగారం బాటలోనే వెండి ధర పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.150 పెరిగి రూ.67,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్కు 0.41 శాతం పెరుగుదలతో 1942 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్కు 1.36 శాతం పెరుగుదలతో 27.07 డాలర్లకు చేరింది.
- Advertisement -