‘మై డియర్ దొంగ’..లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం

9
- Advertisement -

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా మాట్లాడుతూ..‘‘అభినవ్‌తో స్టార్ చేస్తే.. 2014లో మేము తీసిన ఫస్ట్ మూవీ ‘జగన్నాటకం’లో కూడా అభినవ్ దొంగ క్యారెక్టర్ చేశాడు. మళ్లీ ఇప్పుడు పదేళ్ల తర్వాత దొంగ పాత్ర చేశాడు. ఇందులో కామెడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ర్యాడికల్ కామెడీ ఉంది. మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశా. ఆహా గురించి చెప్పక్కర్లేదు. ఆహా నుంచి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

నిర్మాత మహేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మై డియర్ దొంగ అంటే ఈ టీమ్‌లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చింది ఆహా. చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్(CAM) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్లు చంద్ర, అభిలాష్, మహేశ్. కొత్తవాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు.

నటుడు నిఖిల్ మాట్లాడుతూ..‘‘ఇది నా ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్. అభినవ్ అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సిద్ధు, అడివి శేష్ లాగా శాలినీ తనే కథ రాసి యాక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇందులో యాక్ట్ చేసిన వాళ్లలో ఒక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నా. నాలాంటి కొత్త నటుడి నమ్మినందుకు ఆహాకు థ్యాంక్స్. ’’ అని అన్నారు.

నటి స్నేహల్ మాట్లాడుతూ..‘‘డైరెక్టర్ కష్టం అంతా ట్రైలర్‌లో కనిపిస్తోంది. శాలినీ రైటింగ్ చాలా బాగుంది. దివ్య శ్రీపాదతో కలిసి నటించడం నా అదృష్టం. ఏప్రిల్ 19న ‘మై డియర్ దొంగ’ను ఆహాలో చూసి ఆనందించండి’’ అని చెప్పారు.

నటి దివ్య శ్రీపాద మాట్లాడుతూ..‘‘నేను ఇందులో బుజ్జి అనే క్యారెక్టర్ చేశాను. నాకు శాలినీ చేసే స్కెచెస్ లాంటివి చాలా నచ్చుతాయి. ఇప్పుడు ఆమె రాసిన సినిమాలో నేను చేశా. ఇదొక నేచురల్ స్టోరీ. నేచురల్ స్టోరీ అంటే అందరూ విలేజ్ బ్యాక్‌డ్రాప్ అనుకుంటారు. కానీ ఇది సిటీలో జరిగే స్టోరీ. అమ్మాయి కష్టాలపై జోక్స్ వేసుకుని నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో నాక్యారెక్టర్ నా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. టైమ్ తెలీకుండా సినిమా మొత్తం చూసేస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

చీఫ్ గెస్ట్ ప్రియదర్శి మాట్లాడుతూ..‘‘శాలినీ, అభినవ్ నా ఫ్రెండ్స్. వాళ్లని సపోర్ట్ చేద్దామని నేను వచ్చాను. మేమంతా ఎక్కడో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే ఉండేవాళ్లం. ఇక్కడ సినిమా స్క్రీనింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఇప్పుడు ఈ స్టేజీ మీద ఉండడం చాలా బాగుంది. యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నా అవకాశాలు రాకపోవడంతో తన స్క్రిప్ట్ తనే రాసుకుని మీ ముందుకు వస్తోంది శాలినీ. యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయన్నట్లు శాలినీని వెతుక్కుంటూ ఆహా వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్మితే అనుకున్నది సాధిస్తారు. అందుకు శాలినీయే ఉదాహరణ. ఈ సినిమా ఆమె కోసం సక్సెస్ అవ్వాలి. మంచి సినిమాలకు ఆహా సపోర్ట్ చేయడం నిజంగా మంచి విషయం. టాలెంట్ ఉన్నవాళ్లకు ఆహా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

Also Read:నులిపురుగుల సమస్యను ఇలా గుర్తించండి!

- Advertisement -