సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన గొగోయ్

253
Chief Justice of India
- Advertisement -

భారతదేశ సర్వోన్నత న్యాయస్ధానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 13 నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్న ఆయన ఈశాన్యం నుంచి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్ దిబ్రూగ‌ఢ్‌లో 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. ఢిల్లీ వ‌ర్సిటీలో న్యాయ‌విద్య‌ను అభ్య‌సించారు. 1978లో బార్ అసోసియేష‌న్‌ల్ చేరారు. 2001 ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్ – హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరి 12న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఆయన పేరు మీద కనీసం సొంత వాహనం, బంగారం కూడా లేదు.  ఆయన భార్యకు  150 గ్రాముల బంగారం ఉంది. రెండు బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలో రూ.6.5లక్షల నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.16 లక్షలున్నాయి. అలాగే రూ. 5లక్షల ఎల్‌ఐసీ పాలసీ ఉండగా దాన్ని 1999లో వెనక్కి తీసుకున్నారు.

- Advertisement -