బోరబండలో నిత్యావసర వస్తువులు పంపిణీ

279
ghmc deputy mayor
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో బోరబండలో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో నేడు నిరుపేద కుటుంబాలకు నిత్య అవసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా పేద ప్రజలు కార్మికులు ఎవరు కూడ ఆకలితో పస్తులు ఉండకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి KCR గారి సూచన మేరకు ప్రతి రోజూ కోంత మంది పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలకు ఒక నేలకు సరిపడే నిత్య అవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది అని దినికి సహకారం అందించిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి మా బోరబండ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. లాక్ డౌన్ ముగిసే వరకు కూడ ఇదే విధంగా నా శక్తి కొద్దీ పేద ప్రజలకు సహాయం చేస్తాం బాబా ఫసియుద్దీన్ అన్నారు.

ghmc deputy mayor ghmc deputy mayor

- Advertisement -