ఓటీటీలోకి గీతాంజలి మళ్లీ వచ్చింది

12
- Advertisement -

గీతాంజలి మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. శివ తుర్లపాటి దర్శకత్వంలో హార్రర్‌లో జోనర్‌లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ఆహాలో మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ తెరకెక్కించారు. అంజలి ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో రాంచరణ్‌ హీరోగా ఆర్‌సీ 15గా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

Also Read:OTT:ఈ వారం సినిమాలివే

- Advertisement -