రికార్డుల మోత మోగిస్తున్న ‘గీత గోవిందం’

618
Geetha-Govindam
- Advertisement -

విజయ్‌ దేవరకొండ, రష్మీక మందన్న హీరోయిన్లుగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పరుశరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గీతగోవిందం. ఆగస్టు 15 స్వాంత్రంత్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆడిషన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ రావడంతో ఇప్పటికీ థియేటర్లలో హౌజ్‌ పుల్‌ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్‌సీస్‌ లో కూడా ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తుంది.

Geetha-Govindam-Movie

గీత గోవిందం ఏకంగా రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా ఓవరాల్‌గా 75 కోట్ల కలెక్షన్ల సునామి సృష్టించింది. రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి తర్వాత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా గీత గోవిందం నిలిచింది. పెళ్లి చూపులుతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న విజయ్‌రెడ్డి ఆ తర్వాత వచ్చిన అర్జున్‌ రెడ్డి సినిమాతో స్టార్‌ హీరోగా మారిపోయాడు. గీత గోవిందం సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్‌ దేవరకొండకు మరింత క్రేజ్‌ ఏర్పడింది.

Vijay-Devarakonda-and-Rashmika-Mandanna

ఇప్పుడు విజయ్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మామూలుగా లేదు. ఎక్కడ చూసినా విజయ్‌ దేవరకొండ.. అర్జున్‌ రెడ్డి.. అంటూ అభిమాన సంఘాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా గీతగోవిందం హావానే కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై దాదాపు 10 రోజులు గడిచినప్పటికీ ఈ మూవీని చూడడానికి థియేటర్లలోకి జనం క్యూ కడుతూనే ఉన్నారు. ఈ మూవీలో పాటలు మంచి హిట్టవ్వడంతో పాటు హీరోయిన్‌ రష్మీక యాక్టింగ్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్లుగా నిలిచాయి. ఇప్పటికే పలు రికార్డులను క్రియేట్‌ చేసిన ఈ మూవీ ముందు ముందు మరెన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

- Advertisement -