మళ్లీ ఆస్పత్రిలో చేరిన సౌరవ్!

219
sourav
- Advertisement -

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో కోల్ కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరారు దాదా. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురికావడం,ఇవాళ మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదా మళ్లీ ఆస్పత్రిలో చేరారనే వార్త కుటుంబ సభ్యులతో సహా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలె గంగూలీకి గుండె పోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే గంగూలీ… తర్వాత డిశ్వార్జ్‌ అయి ఇంటికి వచ్చారు.

- Advertisement -