‘దిల్ సే’ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు…

27
- Advertisement -

ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్ లో “దిల్ సే ” స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యం లో మొదటి సారి గా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేల తాళాలతో వినాయకుణ్ణి భక్తుల సమక్షంలో ఊరేగించి , భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు , పాటల కార్యక్రమాలతో సందడి గా నిర్వహించారు.

అశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతి ని NRI లు మరవకుండా ఇటువంటి గొప్ప సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించిన “దిల్ సే” అధ్యక్షుడు హర్ష రెడ్డి , నిర్వాహకులు సాయి కిరణ్ , నిఖిల్, దరణేశ్, శ్రవణ్, బంటీ, శ్రీకర్, నవీన్ , ఉమా పతి, సాగర్, శరత్, మోహన్, ప్రజ్జున్, శ్రీకాంత్, దత్తా, భవేశ్ లను ప్రవాస సంఘాలు, ప్రజలు అభినందించారు. గణేష్ లడ్డు ను వేలం లో జ్యూస్ క్రీం అండ్ కో ఫుట్ స్క్రే సంస్థ 15 వేల 116 డాలర్ల అత్యధిక మొత్తం తో సొంతం చేసుకోవడం విశేషం.

Also Read:Anjali:గీతాంజ‌లి ఈజ్ బ్యాక్‌

- Advertisement -