గాంధీలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు..

190
gandhi hospital
- Advertisement -

తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు లోహిత్ రెడ్డి. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మంత్రి ఈటల హామీతో రెండు సార్లు చర్చల అనంతరం సమ్మె విరమించినట్లు ఆయన తెలిపారు.

మంగళవారం రాత్రి నుంచి గాంధీలో జూడాలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు 3 వందల మంది గాంధీ ఆస్పత్రి ఎదుట ప్రధాన రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. వైద్యులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -