మొక్కలు నాటిన గంధం రాములు

42
- Advertisement -

బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రైవేట్ ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాషన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు దండుగుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి మోహన్ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: దట్ ఈజ్ కే‌టి‌ఆర్..!

ఈసందర్భంగా గంధం రాములు మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని..ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గత 3సంవత్సారలుగా నాపుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నాన్ని…భవిష్యత్‌లో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని అన్నారు.

Also Read: KTR:హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌..మరీ మీకు ఎవరు.?

- Advertisement -