లాక్ డౌన్.. కాల్ కొట్టు .. పండ్లు పట్టు..!

445
fruits home delivery
- Advertisement -

కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ నేపథ్యంలో రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటివద్దకే పండ్ల సరఫరా కార్యక్రమం చేపట్టింది మార్కెటింగ్ శాఖ. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ప్రయత్నానికి ఆదరణ పెరుగుతున్నది. ఈ కార్యక్రమం జంటనగారాలలోని కాలనీలు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు 30 ప్యాక్ లు ఆర్డర్ ఇస్తే నేరుగా ఇంటికి సరఫరా చేస్తారు.

రూ.300 లకు మామిడి 1.5 కేజీ, బొప్పాయి 3 కిలోలు, సపోట 1 కేజీ, బత్తాయి 2.5 కేజీలు, 12 నిమ్మకాయల ప్యాక్, 4 కిలోల కలంగిరి అందిస్తారు. 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల కలంగిరి (వాటర్ మిలన్), 2 టన్నుల నిమ్మ , 10 టన్నుల బొప్పాయి సరఫరాకు సిద్ధమైయ్యారు మార్కెటింగ్ శాఖ సిబ్బంది. ఆర్డర్‌ కోసం 7330733212 కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే మీ ఇంటివద్దకే నాణ్యమైన పండ్లు పంపిస్తారు.

fruits

ఈ ప్రయోగం ఉద్యాన పంటల రైతులను ఆదుకునేందుకు సత్పలితాలిస్తున్నది. ఈ కార్యక్రమంలో పండ్ల పంపిణీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రవికుమార్, జేడీ శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరాదికి బత్తాయి, మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రజలు బయటకు రాక స్థానికంగా అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే మొబైల్ రైతుబజార్ల ద్వారా రోజుకు 550 కేంద్రాలలో ప్రజల వద్దకు పండ్లు, కూరగాయలు పంపిస్తున్నారు. వారానికి జంటనగరాలలోని 3500 పై చిలుకు ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. పండ్ల సరఫరాకు ప్రత్యేక కార్యాచరణతో రైతులకు ఉపశమనం లభించింది. అయితే పండ్లను వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతుల వద్ద నుండి నేరుగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సేకరిస్తున్నది. వీలయినన్ని ఎక్కువ మొత్తంలో పండ్ల సరఫరాకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని అధికారులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -