తమిళ నటుడు సూర్య వ్యక్తిగత భద్రతాధికారి (PSO)ని ఆయన ఇంటి పనిమనిషి మరియు ఆమె కుటుంబ సభ్యులు రూ.42 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం, ఈ నిందితులు చెన్నైలో మరికొంతమందిని కూడా ఇలాంటి పద్ధతుల్లో మోసం చేసి, మొత్తం రూ.2 కోట్ల వరకు కాజేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సూర్య ఇంటి పనిమనిషి సులోచన మరియు ఆమె కుమారుడు, భద్రతాధికారి ఆంథోనీ జార్జ్ ప్రభును ఒక ఇన్వెస్ట్మెంట్ పథకంలో పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టారు. మొదట నమ్మకం కలిగించేందుకు రూ.1 లక్ష పెట్టుబడికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చారు. దీంతో నమ్మిన ప్రభు.. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో సుమారు రూ.42 లక్షలు బదిలీ చేశారు.
అయితే మార్చిలో డబ్బు తిరిగి ఇవ్వమని అడగడం ప్రారంభించగానే నిందితులు స్పందించకపోగా, అదృశ్యమయ్యారు. దర్యాప్తులో, ఇదే తరహా పద్ధతితో మరికొంత మందిని కూడా మోసం చేసినట్లు బయటపడింది.జూలైలో ఈ కేసులో ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం బలాజీ, భాస్కర్, సులోచన, విజయలక్ష్మి అనే నలుగురిని అరెస్టు చేసి న్యాయపరమైన కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ విషయం బయటపడిన వెంటనే, సూర్య పనిమనిషిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించారు. అయితే ఈ ఘటనపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Also Read:అంత్యక్రియలు..ప్రపంచ రికార్డు!

