నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్..

154
Elections
- Advertisement -

దేశంలో తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మంగళవారం నిర్వహించిన పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అత్యధిక సంఖ్యలో పార్టీలకు సమరాంగణంగా మారిన తమిళనాడులో సాయంత్రం 6 గంటల సమయానికి 64.92 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు.

మూడో విడత పోలింగ్ జరుపుకున్న బెంగాల్‌లో సాయంత్రం 5 గంటల వరకు 77.68 శాతం పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో ఈ విడతలో 31 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటల సమయానికి 77.90 శాతం ఓటింగ్ జరిగింది. ఇక తుది విడత పోలింగ్ జరుపుకున్న అసోంలో సాయంత్రం 5 గంటల సమయానికి 78.94 శాతం ఓటింగ్ నమోదైంది. కేరళలో సాయంత్రం 5 గంటల సమయానికి 69.95 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -