బాక్సాఫీస్ పోటీలో నాలుగు సినిమాలు

244
tollywood movies
- Advertisement -

2018 సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంవ‌త్స‌రంలో మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం, అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి వంటి చిత్రాలు ఈ సంవ‌త్స‌రం టాలీవుడ్ లో కాసుల వ‌ర్షం కురిపించాయి.

tollywood movies

అయితే ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో పెద్ద సినిమాల హడావుడి లేక‌పోయినా చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి. పేరుకు చిన్న సినిమాలే అయినా అభిమానుల‌కి మాత్రం మాంచి విందునే అందిస్తున్నాయి. ఈ మ‌ద్య తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విడుద‌లైన ఆర్ ఎక్స్ 100, గూఢాచారి, గీత గోవిందం వంటి చిత్రాలు ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాయి. అయితే వ‌చ్చే శుక్ర‌వారం నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆటగాళ్లు, నీవెవ‌రోతో పాటు ప్ర‌భుదేవా న‌టించిన ల‌క్ష్మి, ర‌ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అంత‌కుమించి సినిమాలు ఆగస్టు 24వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

anthaku minchi

ఆట‌గాళ్లు మూవీలో జ‌గ‌ప‌తిబాబు, నారారోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లోన‌టించారు. ల‌క్ష్మీ సినిమాలో ప్ర‌భుదేవా లీడ్ రోల్‌లో న‌టించారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నీవెవ‌రో చిత్రం రూపొందింది. యంక‌ర్ ర‌ష్మీ మ‌రోసారి అంత‌కు మించి సినిమాతో మ‌నకు త‌న అందాల విందును మ‌రోసారి రుచి చూపించ‌బోతోంది. చూడాలి మ‌రి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో.

- Advertisement -