కవితక్క కృషితో స్వస్థలాలకు చేరిన అమ్మాయిలు..

205
kavitha
- Advertisement -

లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో చిక్కుకున్న 68 మంది తెలంగాణ యువతులు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో వారి స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలకు చెందిన 68 మంది యువతులు లాక్ డౌన్ ‌కారణంగా ‌మహారాష్ట్రలోని‌ సోలాపూర్‌లో చిక్కుకుపోయారు. యువతులందరినీ అక్కడి ‌ఒక ప్రైవేటు కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు.

kavitha

అయితే 23 రోజులుగా ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం, పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో యువతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.యువతుల కుటుంబ సభ్యుల్లో ఒకరు, వారి సమస్యలను ట్విట్టర్ ద్వారా ‌మాజీ‌ ఎంపీ ‌కవితకి వివరించి, సహాయం చేయాల్సిందిగా కోరారు. దానిపై వెంటనే స్పందించిన ‌మాజీ‌‌ ఎంపీ కవిత, యువతులు తెలంగాణ కు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

kavitha

3 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించిన మాజీ ఎంపీ ‌కవిత, బస్సుల్లో‌ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. 68 మంది యువతులు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ‌యువతులను క్వారంటైన్‌లో ఉంచేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. కోరిన వెంటనే స్పందించి, స్వస్థలాలకు చేరుకునేలా‌ సహాయం చేసిన మాజీ ‌ఎంపీ‌ కవితకు యువతులు, వారి తల్లిదండ్రులు ‌కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -