శ్రీమంతుడు@ తొలి తెలుగు సినిమాగా రికార్డ్

10
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీమంతుడు’ 8 సంవత్సరాల క్రితం 2015లో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి హిట్‌గా నిలిచింది.

శ్రీమంతుడు ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో 200 M+ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్ తో పాటు అత్యధికంగా ఇష్టపడిన తెలుగు చిత్రంగా నిలిచింది.

Also Read:పిక్ టాక్ : ఉఫ్.. సొగసుల విధ్వంసం

శ్రీమంతుడు గ్రామ దత్తత నేపధ్యంలో అలరించిన చిత్రం. తండ్రి జన్మించిన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదర్శవంతమైన యువకుడి కథ. ఈ సినిమా గ్రామాల ప్రాముఖ్యతను, మానవీయ విలువలను నేర్పుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌కు తొలి ప్రొడక్షన్ వెంచర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మంచి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్నారు.రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి చాలా అవార్డులు వచ్చాయి.

Also Read:TTD:వర్షాలు కురవాలని మహాశాంతి వరుణయాగం

- Advertisement -