విశాఖలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..

135
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా వైరస్ వ్యాప్తిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ విశాఖలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు చేరాయి. ఈనెల 15వ తేదిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుండి విశాఖ వచ్చాడు. అయితే ఇతనికి టెస్ట్‌లు చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓ ప్రైవేటు హస్పటల్‌లో చికిత్స తీసుకుని నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయ్యాడు. అనంతరం ఆ వ్యక్తి అధికారులు అబ్జర్వేషన్‌లో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. నిబంధనలు ప్రకారం ఎయిర్ పోర్ట్‌లో తీసిన శాంపిల్స్‌ను హైదరాబాద్ సీసీఎంబీ కి పంపడంతో ఒమిక్రాన్‌గా నిర్థారణ అయ్యింది.

- Advertisement -