ఢిల్లీలో టపాకాయలు అమ్మడం,కాల్చడం నిషేధం: గ్రీన్ ట్రిబ్యునల్

223
diwali
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి టపాకాయలు అమ్మడం, కాల్చడం పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నవంబర్ 9- 10వ తేదీ అర్ధ రాత్రి నుంచి 30వ తేదీ అర్ధ రాత్రి వరకూ ఢిల్లీ ఎన్ సి ఆర్ పరిధిలో దీపావళి టపాకాయలు కాల్చడం పూర్తిగా నిషేధం అని తెలిపింది.

దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న అన్ని నగరాలలో ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గ్రీన్ క్రాకర్స్ వాడేవారు మాత్రం పండుగ రోజు కేవలం రెండు గంటల పాలు టపాసులు కాల్చుకోవచ్చు అని తెలిపింది.కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశం జారీ చేసింది.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలిపింది.కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాయు కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది గ్రీన్ ట్రిబ్యునల్.

- Advertisement -