సూడాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సయిద్నా ఎయిర్ బెస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా..గాల్లోకి ఎగిరిన కాసేపటికే నివాస ప్రాంతంలో కూలిపోయింది. మృతుల్లో ఆర్మీ అధికారులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో 46 మంది మృతి చెందారు.
వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:ఇంగ్లండ్పై ఆఫ్ఘానిస్తాన్ సంచలన విజయం
ఘోర విమాన ప్రమాదం.. 46 మంది మృతి
సూడాన్లో ఇంటిపై కుప్ప కూలిన సైనిక విమానం
ప్రమాద ఘటనలో 46 మంది మృతి.. పది మందికి పైగా తీవ్ర గాయాలు
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం pic.twitter.com/XCXx0GvWin
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2025

