కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు…

158
farmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 14వ రోజుకు చేరాయి. రైతులను శాంతింప చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించట్లేదు.తాజాగా రైతు సంఘాల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు.

రైతులు ఆందోళ‌న విర‌మించేందుకు ఒప్పుకుంటే వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేస్తామంటూ తీసుకొచ్చిన ప్రతిపాదనలను రైతు సంఘాల నాయ‌కులు ఏక‌గ్రీవంగా తిర‌స్క‌రించారు. రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ చ‌ట్టాలను ర‌ద్దు చేయ‌డం తప్ప తాము మ‌రే ప్ర‌తిపాద‌న‌కు ఒప్పుకోమ‌ని తేల్చిచెప్పారు.

ఏపీఎంసీల్లో ఒకే ట్యాక్స్ ఉంటుందన్న సవరణకు కేంద్రం సానుకూలంగా ఉండగా ప్రైవేటు కొనుగోలుదారుల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసేలా సవరణ చేయనుంది.ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా మార్పు చేస్తామన్న కేంద్రం….వ్యాపారులు-రైతుల ఒప్పంద వివాద పరిష్కారంలో ఎస్‌డీఎంల అధికారాల సవరణకు సైతం కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు కల్పించేలా సవరణ చేస్తామని తెలిపింది.ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూములకు రక్షణ కల్పించేలా మరో సవరణ…కనీస మద్ధతు ధరపై రాతపూర్వక హమీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదన తీసుకొచ్చింది.పంట వ్యర్థాల దహనం అంశంపై పంజాబ్, హర్యానా రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వచ్చింది కేంద్రం.అయితే వీటిని తిరస్కరించారు రైతు సంఘాల నేతలు.

- Advertisement -