రుణమాఫీ కోసం గాంధీ భవన్ మెట్లు ఎక్కారు రైతులు. గాంధీ భవన్ ముందు ధర్నా చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి మాటలు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు.
తన పేరు తోట యాదగిరి శాలిగౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం.. 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని విక్రయించాను. కానీ ఇప్పటి వరకు బోనస్ రాలేదు. అంతే కాదు రుణమాఫీ కూడా కాలేదు.. ఇటు పెన్షన్లు లేవు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్
రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా
వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్
రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికి చేశామని ప్రచారం చేయకండి
పెన్షన్, పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ… pic.twitter.com/T1jhUXv1re
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
Also Read:కోమటిరెడ్డి మనిషిలా మాట్లాడటం లేదు!

