సీఎస్‌తో ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ భేటీ..

372
SC, ST Commission Chairman
- Advertisement -

ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యుల బృందం బిఆర్కే భవన్‌లో ప్రిన్సిపాల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సీఎస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సివిల్ రైట్స్ డేలో పాల్గొనాల్సిందిగా సీఎస్ కు ఆహ్వానం అందించారు. ఇందుకు సీఎస్ ఎస్కె జోషి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి తీసుకున్న చర్యలు,అట్రాసిటీ కేస్ ల పురోగతిపై సీఎస్ కు నివేదిక ఇచ్చాము. అట్రాసిటీ కేస్‌లలో సత్వర న్యాయం చేస్తున్నాం అని సీఎస్‌కు తెలిపాము. సీఎస్ కూడా సంతోషం వ్యక్తం చేశారని శ్రీనివాస్‌ అన్నారు.

ప్రతి నెల 30 తేదీన సివిల్ రైట్స్ డేగా ఎమ్మెల్యే లు,ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహిస్తున్నాం. గతంలో సివిల్ రైట్స్ డే ఎప్పుడో ఒక్కసారి జరిగేది. ఈ సివిల్ రైట్స్ డే లో సీఎస్ ను కూడా పాల్గొనాలి అని కోరామని అన్నారు.సీఎస్ పాల్గొంటే సివిల్ రైట్స్ డేలో కింది స్థాయి అధికారులు కూడా పాల్గొంటారు.

మేము ఆడిగిన వెంటనే సీఎస్ సీవీల్ రైట్స్ డేలో పాల్గొనేందుకు అంగీకారాన్ని తెలిపారు. వచ్చే నెల 30 తేదీన సివిల్ రైట్స్ డే పాల్గొంటారు ఆయనతో పాటు డీజీపీ,ప్రిన్సిపాల్ సెక్రటరీ లు కూడా పాల్గొంటారు అని ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు.

- Advertisement -