సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జేపీఎస్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎర్రబెల్లి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ప్రక్రియ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యలరైజ్ చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేశారని తెలిపారు. ఆ కమిటీల నివేదికలు రాగానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు.పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు మంత్రి ఎర్రబెల్లిని కలిసి ఆ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.
Also Read:రోహిణి కార్తె..తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
ప్రజలకు అందుబాటులో ఉండి సమర్థవంతమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.