సీఎం కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు..

59
- Advertisement -

ఈ నెల 11న జనగామ కు సీఎం కేసీఆర్ సందర్శన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా వారు జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పరిశీలించారు. అలాగే పార్టీ కార్యాలయం సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. సభ వేదిక నిర్వహించాల్సిన చోటు, సభ స్థలంలో ప్రజలు తరలి వచ్చే, బయటకు వెళ్ళే దారులని పరిశీలించారు. సభావేదిక నిర్మాణం చేయనున్న వాళ్లకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.

- Advertisement -