సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి..

94
Errabelli
- Advertisement -

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడుర్ గ్రామానికి చెందిన కాముని పరమేశ్వర్ కు వైద్య చికిత్స ఖర్చుల కోసం మంజూరైన 2 లక్షల రూపాయల బ్యాంక్ చెక్కును అయన కుమారుడు నర్సింహ స్వామికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాదులోని బంజారాహిల్స్ లో నున్న మినిష్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు.

రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక సహాయం అందజేస్తున్నారని మంత్రి దయాకర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందజేస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి తోడుగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక సహాయం అందజేస్తున్నారని ఆయన అన్నారు.

- Advertisement -