అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్న వారిపై కేసులు

293
errabelli
- Advertisement -

వరంగల్ రూరల్ జిల్లా పరకాల జూనియర్ కాలేజీ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను ఆకస్మికంగా పరిశీలించారు పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులకు జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేశారు.

అనంతరం తన స్వగ్రామం ప‌ర్వ‌త‌గిరిలో ప్ర‌జ‌ల్లో కరోనాపై అవ‌గాహ‌న‌, చైత‌న్యం క‌ల్పించారు. మంచినీటి ప్లాంట్ ద‌గ్గ‌ర గుంపులుగా గుమి గూడి ఉన్న ప్ర‌జ‌ల‌ను అలా ఉండ‌కూడ‌ద‌ని వివ‌రించి, సామాజిక‌, భౌతిక దూరాన్ని పాటించాల‌ని అవ‌గాహ‌న కల్పించారు.

సామాజిక‌, భౌతిక దూరం పాటించాలంటూ తాను స్వ‌యంగా ముగ్గు వేసి, ఆయా చోట్ల ప్ర‌జ‌ల‌ను నిల‌బెట్టి… క‌రోనా స‌మ‌స్య తీరే వ‌ర‌కు ఆ దూరం పాటించాల‌ని చెప్పారు. క‌రోనా ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామాల్లో లేనంత మాత్రాన‌…నిర్ల‌క్ష్యం చేయవద్దన్నారు. క‌రోనా ఖ‌త‌మ‌య్యే వ‌ర‌కు పూర్తి స్థాయిలో ప్ర‌జ‌లు ముందు జాగ్ర‌త్తగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

- Advertisement -