పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి..

172
minister errabelli
- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల ఇతర మండల స్థాయి నాయకులు, ఇంఛార్జి లు, కార్యకర్తలు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని తెలిపారు. నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటాను. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పట్టభద్రులకు వివరించండి అని పార్టీ నాయకులకు సూచించారు.

టీఆర్‌ఎస్ అభివృద్ధి, సంక్షేమంతో పాటు, బీజేపీ, ఇతర పార్టీల వైఫల్యాలను పట్టభద్రులకు చెప్పండి. ఇతర పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పట్టభద్రులను కలిసి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వెయ్యమని అభ్యర్థించండి అని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

- Advertisement -