షాక్… త్వరలో ఆ రెండు జిల్లాల్లో మార్పులు..

235
Errabelli Dayakar Rao
- Advertisement -

భూపాలపల్లి జిల్లాలో పరకాలను కలపబోమని, వరంగల్ రూరల్ జిల్లాలోనే ఉంటుందని దామెరా మండలం ఎప్పుడు వరంగల్ రూరల్ జిల్లాలోనే ఉంటుందని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామంలో ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలను మార్చబోతున్నామని, త్వరలో ఈ రెండు జిల్లాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు.

Errabelli Dayakar Rao

గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలనలో ఏ పని జరగలేదని ఎర్రబెల్లి విమర్శించారు. ముసలి వాళ్లకు గౌరవం తెచ్చింది కేసీఆరేనని, రైతలను పట్టించుకుంది కేసీఆర్ ప్రభుత్వమేనని, 24 గంటల కరెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చింది కేసీఆరేనని కొనియాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపిస్తే ల్యాదేళ్ల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయించిన వ్యక్తులే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

- Advertisement -