సేవ చేయ‌డంలోనే ప‌రమార్థం ఉంది- మంత్రి ఎర్రబెల్లి

198
Errabelli
- Advertisement -

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరికి శ‌వ‌పేటిక‌ను అంద‌చేసిన మార్కండేయ‌ను అభినందించారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావుమంత్రి ఎర్ర‌బెల్లి స‌మ‌క్షంలో రూ.75వేల రూపాయ‌ల చెక్కుని గ్రామ పంచాయ‌తీకి అంద‌చేశారు మార్కండేయ‌.ఈ సందర్భంగా మంత్రి మార్కండేయ‌ను శాలువాతో స‌త్క‌రించారు.

మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ.. గ్రామానికి ఎంతో కొంత సేవ‌, సాయం చేయ‌డాన్ని అల‌వాటు చేసుకోవాలి. గ్రామం మొత్తానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా శ‌వ‌పేటిక (ఫ్రీజ‌ర్)ను అంద‌చేస్తున్న మార్కండేయ‌కు అభినంద‌న‌లు. నాగ్రామానికి నేను సైతం… వైకుంఠ ర‌థాన్ని ఇవ్వాల‌ని నిర్ణ‌యించానని మంత్రి తెలిపారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌ల కేంద్రాలు పాల‌కుర్తి, తొర్రూరు, రాయ‌ప‌ర్తి, కొడ‌కండ్ల మండ‌లాల‌కు ముందుగా వైకుంఠ ర‌థాల‌ను ఇవ్వనున్నాను స్పష్టం చేశారు.

ఆ వాహ‌నాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆయా గ్రామాల‌కు వాటిని అప్ప‌గిస్తాను. సంపాదించ‌డంలోనే కాదు, సేవ చేయ‌డంలోనే ప‌రమార్థం ఉంది. గ్రామానికి చెందిన‌వారు సహా, దేశ‌, విదేశాల్లో ఎక్క‌డెక్క‌డో ఉన్న‌వాళ్ళంతా పేద‌ల‌కు, ప్ర‌జ‌లంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే సేవా ప‌నులు చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -