రాష్ట్రంలో కళలకు పూర్వ వైభవం: మంత్రి

154
errabelli
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కళలు, భాష, సాహిత్యం, సంస్కృతిలకు పూర్వ వైభవం కలుగుతున్నది అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆదివారం వరంగల్ లోని పోతన కళా భవనంలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి 36వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రదర్శనలు చేసిన కళాకారులకు పురస్కారాలు అందించి వారిని అభినందించారు మంత్రి ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కళలు, భాష, సాహిత్యం, సంస్కృతి లకు పూర్వ వైభవం కలుగుతున్నది అన్నారు. కళలను పోషిస్తూ, తగిన గుర్తింపుని తెస్తున్నారని చెప్పారు. కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.

సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాంస్కృతిక సాహిత్య పరంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలుపడానికి కృత నిశ్చయంతో వున్నారు అని మంత్రి అన్నారు.సమైక్య రాష్ట్రంలో మరుగున పడిన కళలను అన్నింటినీ రాష్ట్రం సిద్ధించాక ఆ కళలను అభివృద్ది చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాంతి కృష్ణ సమితి సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -