త్వరగా రైతు వేదికల నిర్మాణం: మంత్రి ఎర్రబెల్లి

216
Minister errabelli dayakar
- Advertisement -

రైతు వేదిక పనులు త్వరగా ప్రారంభించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు…..రైతు వేదిక పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. కల్లాల నిర్మాణాలకు రైతులు ముందుకు రావాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాంట్రాక్టర్ లపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల సొంతింటి కల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు….సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో పాలకుర్తికి అయిదు వేళా డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేయించానని వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి…..ఈ నెల 25 తేదీ లోపల పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ల ప్రారంభోత్సవం జరగాలన్నారు.వారం రోజుల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడుతామన్నారు.

- Advertisement -