మొక్కలు నాటిన ఏనుగు భరత్ రెడ్డి

149
- Advertisement -

తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, కప్పపహాడ్ ఎంపీటీసీ ఏనుగు భరత్ రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిగా తీసుకొని ఇబ్రహీంపట్నంలోని తన వ్యవసాయ క్షేత్రంలో అయన మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తి నింపిందని, తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అయన తెలిపారు.

- Advertisement -