ట్విట్టర్‌ నుండి తప్పుకోమంటారా?

24
- Advertisement -

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఉద్యోగుల తొలగింపు దగ్గరి నుండి బ్లూ టిక్‌ మార్క్‌ ఉన్న అకౌంట్స్‌, ఫేక్ అకౌంట్స్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ నుండి తప్పుకోవాలా అంటూ పోల్ నిర్వహించగా 56 శాతం మంది అవును అని తెలపగా 44 శాతం మంది కాదు అని తెలిపారు. వచ్చే ఫలితాలు ఏవైనా కట్టుబడి ఉంటానని తెలపగా దీనిపై మస్క్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -