బూతు సినిమాలే చేస్తానంటుంది

23
- Advertisement -

బాలీవుడ్ లేడీ నిర్మాత ఏక్తా కపూర్‌ అడల్డ్ సినిమాలను తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘రాగిణి MMS’, ‘ది డర్టీ పిక్చర్‌’, ‘షాదీ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘ఏక్‌ విలన్‌’ వంటి సినిమాలు ఈమె నిర్మాణంలో వచ్చినవే. ఈ నేపథ్యంలో ఏ సర్టిఫికేట్‌ సినిమాలు చేయడం మానేయ్‌ అంటూ ఏక్తా కపూర్‌‌పై నెటిజన్లు నెట్టింట విమర్శలు చేస్తుండగా.. ”నేనొక అడల్ట్‌. కాబట్టి అడల్ట్‌ సినిమాలే చేస్తా” అని నిర్మాత ఏక్తా కపూర్‌ కౌంటర్‌ ఇచ్చింది. అలాగే, ఈ లేడీ నిర్మాత మీడియాపై కోపంతో చిందులేసింది. ఈ మధ్య మీలో బోల్డ్‌నెస్‌ ఎక్కువైంది. ఆస్తులు పెంచుకోవడానికే అని అడగగా ఆమెకు కోపం వచ్చేసింది.

మీడియా ప్రతినిధుల పై ఏక్తా కపూర్‌ సీరియస్ అవుతూ.. ‘మీకు తోచింది రాస్తారు. అందులో నిజానిజాలు మీకు కూడా తెలియవు. కానీ, అలా రాసినంత తేలిక కాదు నిర్మాణం. ఒక నిర్మాతగా నా పరిధి నాకు తెలుసు. బూతు సినిమాలు చేస్తానని అందరూ నన్ను విమర్శిస్తారు. అసలు బూతు లేకుండా ఈ ప్రపంచం ముందుకు వెళ్తుందా ?, అలాంటి విషయాల పై సినిమాలు చేస్తే ఏదో పాపం చేసినట్లు ఫీల్ అవుతారు. నాకు సంబంధించి నేను నాకు నచ్చిందే చేస్తాను. నేను ఎన్నుకొనే కథలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఎందుకంటే.. నాకు అవే నచ్చుతాయి. నేను అలాగే ఉంటాను’ అంటూ ఏక్తా కపూర్‌ చెప్పుకొచ్చింది.

Also Read:దేశమంతా తెలంగాణ వైపే!

ఏది ఏమైనా ఏక్తా కపూర్‌ చాలా కమర్షియల్ గా ఉంటుంది. అలాగే ఆమె పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రవర్తన, ఆమె వేషధారణ పై కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇక నటీనటుల పట్ల ఆమె తీరు కూడా చాలా విచిత్రంగా ఉంటుందని అంటుంటారు. కొందరు నటులను కూడా ఆమె చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందని.. వారితో వెకేషన్స్ కు వెళ్తూ ఉంటుందని ఏక్తా కపూర్‌ పై చాలా పుకార్లు నిత్యం షికార్లు చేస్తూ ఉంటాయి.

- Advertisement -