ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూత…

33
gautham raju
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటింగ్‌ని ప్రారంభించారు గౌతమ్ రాజు. ఎనిమిది భాషల్లో 8 వందలకుపైగా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, అదుర్స్‌, ఊసరవెల్లి, బద్రీనాథ్‌, బలుపు, గోపాల గోపాల, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాయక్, రేసుగుర్రం, అల్లుడు శీను, పవర్, బెంగాల్‌ టైగర్, సౌఖ్యం, డిక్టేటర్‌ వంటి చిత్రాలకు ఎడిటింగ్ అందించారు. నంది అవార్డు సైతం అందుకున్నారు.

- Advertisement -