మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో ఉన్న హింగోలి జిల్లాలో గురువారం ఉదయం 4.4 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంప కేంద్రం హింగోలి జిల్లాలో ఉందని, దీని ప్రకంపనలు పర్భణీ మరియు నాందేడ్ జిల్లాల్లో కూడా కనిపించాయి.
భూకంప తీవ్రత తక్కువవగా ఉండటంతో ఏ భవనాలు దెబ్బతినలేదు. భూకంపం సంభవించిన తర్వాత, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.
భూమి లోపలి పొరల్లో జరిగే సహజ కదలికల వల్లే ఇలాంటి తక్కువ నుండి మధ్యస్థ తీవ్రత గల భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హింగోలి, పర్భణీ మరియు నాందేడ్ వంటి ప్రాంతాలు గతంలో కూడా ఇటువంటి ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో హింగోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
భూకంపం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
భూకంపం సంభవించిన ప్రాంతంలోని ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, ఎందుకంటే కంగారు పడటం వల్ల గాయాలు కావచ్చు.
Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే!
భూకంపాల సమయంలో చాలా వరకు గాయాలు ప్రజలు భయంతో ఇటు అటు పరుగెత్తడం వల్లే జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో వారు పైనుంచి పడే శిథిలాల బారిన పడే అవకాశం ఉంది.
భవనాల పైకి వెళ్లడానికి లేదా కిందకు రావడానికి ప్రజలు లిఫ్టులను ఉపయోగించకూడదు. ఎందుకంటే విద్యుత్ సరఫరా నిలిచిపోయి వారు లోపల చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాల్లో ఎల్లప్పుడూ మెట్లను మాత్రమే ఉపయోగించండి.

