- Advertisement -
దుబ్బాక ఎన్నికల సందర్భంగా మంగళవారం సీఈఓ శశాంక్ గోయల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్ళీకేరిలు కలిసి లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్ సందర్శించారు. ఓటరు టర్న్ ఔట్ టీమ్తో చర్చించి ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపుతున్న తీరుపై ఆరా తీశారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ బోర్డులో పోలింగ్ కేంద్రాల వారీగా నియోజకవర్గ పరిధిలోని 104 కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భారతి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, దుబ్బాక రిటర్నింగ్ అధికారి పోలింగ్ తీరుతెన్నులపై చర్చించారు.
- Advertisement -