దుబ్బాక… టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు….

184
harishrao
- Advertisement -

టి ఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమాన్ని ఆదరిద్దాం..టి ఆర్ ఎస్ ని ఆశీర్వదిద్దాం ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ ఒక్క మంచి పనైనా చేసిందా.. ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా.. అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట మంత్రి ని నివాసం లో దుబ్బాక మండకం బీజేపీ ఎస్సి సెల్ అధ్యక్షుడు కాస్థి శ్రీనివాస్ , దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్స్ సిద్ధులు తదితరులు మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఒక్క మంచి పనైనా చేసిందా.. ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా.. రైతులు నష్టపోయేలా వ్యవహరిస్తున్నది మీరు కాదా.. తెలంగాణకు మీ వల్ల ఒరిగిందేమిటి.. మళ్ళీ ఏ ముఖాలు పెట్టుకొని ఓట్లడగడానికి వస్తున్నారు అంటూ బీజేపీ పార్టీ విధానాలపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయపోగా వారి పొట్టకొట్టే నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకే చెల్లుతుందని అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టడం ఆ ప్రభుత్వంలోని మంత్రులకే న్యాయంగా అనిపించలేదని, అందుకే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థల చేతికి రైతుల బతుకులను అప్పగించే ప్రమాదకరమైన ఆలోచనకు కేంద్రం తెరతీసిందని అన్నారు. మన దేశంలోనే 280 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయని, ఇందులోనే పుష్కలంగా మక్కలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని వివరించారు.

కానీ విదేశాల నుండే మక్కలను దిగుమతి చేయడానికి కేంద్రం పెద్దలు సంతకాలు చేసి వచ్చారని హరీష్ రావు ఆరోపించారు. దేశంలో బీజేపీ ఎలాంటి సంక్షేమం చేయలేదని, అదే సంక్షేమంలో ముందుకెళ్తున్న తెలంగాణను అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రతీ అడుగు రైతుల కోసమేనని చెప్పారు. అరేళ్లలోనే నూరేళ్ళ అభివృద్ధిని చేసి చూపించిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని వివరించారు. దొంగ రాత్రి కరెంటు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయే మోటార్లు, ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైనులో పెట్టే చరిత్రను కనుమరుగు చేశామని స్పష్టం చేశారు. తొలి ఏడాదిలో మిషన్ కాకతీయ, 2వ ఏడాదిలో 24 గంటల ఉచిత విద్యుత్, 3వ ఏడాదిలో రైతు బంధు, 4వ ఏడాదిలో రైతు భీమా, 5వ ఏడాదిలో కాళేశ్వరం నీళ్లు, ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం ఈ ప్రభుత్వం సాధించిన గొప్ప విషయాలు అని అన్నారు. మెడిగడ్డ నుండి మిరుదొడ్డికి 15 తాటిచెట్ల ఎత్తుకు నీళ్లు తెచ్చామని హరీష్ రావు చెప్పారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి లు కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులేనని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ని చేపట్టిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో కనిపిస్తున్న స్పష్టమైన మార్పే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు అవుతేనే మన గెలుపునకు సార్థకత దక్కుతుందని అన్నారు.మన ఇంటి పార్టీ మన గులాబీ పార్టీ అని.. దుబ్బాక అభివృద్ధి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆలోచనను నిజం చేసేలా మన అభ్యర్థి సుజాత ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..

- Advertisement -