మొక్కలు నాటిన డ్రమ్మిస్ట్ శివమణి..

582
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మాదాపూర్ లోని సీసీఆర్టీలో వరల్డ్ ఫెమస్ డ్రమ్మిస్ట్ శివమణి మొక్కలు నాటారు. ఆయనతో పాటు ఫెమస్ బాసిస్ట్ (గీటారిస్టు) మోహిని డే, సంగీత కారుడు వేణు గాణం నాగరాజు, గాయనీ మణి నాగరాజు, సీసీఆర్టీ అధికారులు తాడేపల్లి సత్యనారాయణ, చంద్రశేఖర్ లు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా శివమణి మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉన్నది. “ఆట కాదురా శివ ప్రోగ్రాం” కోసం నేను హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ రాజ్యసభ సభ్యులు సంతోష్, కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వారు బిగ్ సర్‌ప్పైజ్‌ ఇచ్చారు. వారు నన్ను మొక్కలు నాటాలని కోరడం చాలా ఆనందం, సంతోషం గా ఉంది అన్నారు. అందరు కూడా మొక్కలు నాటాలి బర్త్ డే సందర్భంగా బహుమతులు కాకుండా మొక్కలు కొని ఇవ్వాలని వాటిని సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని శివమణి కోరారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవా, కిషోర్ గౌడ్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Drums sivamani

shivamani

- Advertisement -