నవదీప్‏కు ఈడీ నోటీసులు..

25
- Advertisement -

డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు నోటీసులు జారీ చేసింది ఈడీ. మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.నవదీప్ కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తో సంబంధాలున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో విచారణలో గుర్తించగా ఈ నేపథ్యంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది.

సెప్టెంబర్‌లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాదాపూర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ సరఫరా విషయాలో ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో నైజీరియాకు చెందిన వ్యక్తులతో పాటు ఓ దర్శకుడు, మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని విచారించగా నటుడు నవదీప్ కు వారితో సంప్రదిపులు జరిపినట్లుగా తెలుసుకున్నారు.

అయితే డ్రగ్స్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతు పిటీషన్ వేశారు. సెప్టెంబర్ 19 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించగా గడువు పూర్తయిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ఇచ్చింది.

Also Read:మహిళలల్లో మధుమేహం.. చాలా ప్రమాదం!

- Advertisement -