ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర

189
draupaddi
- Advertisement -

ఒడిషాకు చెందిన ద్రౌపది ముర్ము 1958 లో మయుర్‌భంజ్‌ జిల్లాలో ఉపార్ బెడ గ్రామంలో జన్మించింది. అమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వారిద్దరూ కుమారులు చనిపోయారు. సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము యశ్వంత్‌ సిన్హాపై గెలిస్తే భారత రెండవ, తొలి గిరిజన మహిళాగా చరిత్రలో నిలిచి పోతారు. కాగా భారత ప్రథమ మహిళ ప్రతిభా సింగ్‌ పాటిల్‌ ఎంపికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాపై ఆమె పోటీ చేస్తున్నారు.

ముర్ము భువనేశ్వర్‌లోని రమా దేవి మహిళా కళాశాల నుండి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ పట్టా పోందారు. ద్రౌపది అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా శ్రీ ఆరబిందో ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో పనిచేశారు. 1979 నుంచి 1983 వరకు ఒడిషా ప్రభుత్వంలో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా కూడా పని చేశారు.

ద్రౌపది ముర్ము 1997లో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. తరువాత రాయరంగ్‌పూర్‌ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎన్‌ఏసీ) వైస్-ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. 2000వ సంవత్సరంలో ఒడిషా అసెంబ్లీకి రాయరంగ్‌పూర్‌ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటి చేసి గెలుపోందారు. 2004 లో మరోసారి రాయరంగ్‌పూర్‌ నుండి గెలుపోందింది. ముర్ము, బిజూ జనతాదళ్ (బిజెడి), బీజేపీ మద్దతుతో ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించి విభిన్నమైన పరిపాలనా అనుభవాన్ని గడిచింది. 2007 లో ఒడిషా ఎమ్మెల్యేలకు ఇచ్చే నిల్‌కంఠ అవార్డు ద్రౌపది ముర్ము పోందింది.

2006 నుంచి 2009 వరకు ఒడిషా బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలుగా పనిచేశారు. 2013 లో ఆమె ఒడిశాలోని బీజేపీ పార్టీ షెడ్యూల్డ్ తెగ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుని స్థాయికి ఎదిగారు.

2015 లో జార్ఖండ్‌ 9వ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తొలి మహిళ ద్రౌపది ముర్ము. ముర్ము 2021 వరకు పదవిలో ఉన్నారు. 2016 లో తన మరణాంతరం కళ్లను రాంచిలో ఉన్న కశ్యప్‌ మెమోరియల్‌ ఐ ఆసుపత్రికి దానం చేసింది.

15వ రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఈ నెల 25న భారత సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -